నితిన్ గడ్కరితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

-

సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలిశారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నియోజకవర్గంలో రహదారుల గురించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో చర్చించారు. అలాగే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసలుగా విస్తరించే అంశంపై చర్చించారు. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ప్రమాదకరమని గుర్తించిన 17 ప్రాంతాల మరమ్మత్తు గురించి నితిన్ గట్కరికి వినతి పత్రం అందజేశారు.

ఈ నేపథ్యంలో బ్లాక్ స్పాట్ల రిపేర్ కోసం టెండర్లను పిలిచినట్టు ఎంపీ కోమటిరెడ్డికి వెల్లడించారు కేంద్రమంత్రి. రానున్న 2 నెలల్లో హైదరాబాద్ – విజయవాడ రహదారి విస్తరణ పనులు కూడా చేపట్టనున్నట్టు ఎంపీ కోమటిరెడ్డి కి హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి.

Read more RELATED
Recommended to you

Latest news