తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. ఎంసెట్ చివరి విడత కౌన్సిలింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 5న ద్రవపత్రాల పరిశీలన జరగనుండగా…9న సీట్లు కేటాయించనున్నారు. ప్రత్యేక విడత పేరిట నిర్వహించనున్న మరో కౌన్సిలింగ్ 17న ప్రారంభం కానుంది.

అదే రోజున స్లాట్ బుకింగ్, 18న ధ్రువపత్రాల పరిశీలన, 17 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 23న సీట్లను కేటాయిస్తారు. ఈనెల 23 నుంచి 25 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఇది ఇలా ఉండగా, ఓటర్ల నమోదు కోసం ఆగస్టు 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూలై నాటికి 3,06,42,529 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఈనెల 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version