నవంబర్ 15 లోపు మునుగోడు ఉప ఎన్నిక – సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు

-

బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర పార్టీ ఇన్చార్జి సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 15 తేదీలోపు మునుగోడు లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందన్నారు. ఇన్చార్జులు మునుగోడు లోనే ఉండాలని ఆయన ఆదేశించారు. ఎన్నికను అందరూ సీరియస్ గా తీసుకోవాలని సునీల్ బన్సల్ సూచించారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని సునీల్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీకి చెందిన కీలక నేతలతో సమీక్ష కోసం శనివారం తెలంగాణ వచ్చిన ఆయన మునుగోడు పరిధిలోని చౌటుప్పల్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మునుగోడులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఉపఎన్నిక షెడ్యూల్ పైనే సస్పెన్స్ సాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news