ముస్లింలు BRSకు ఓటు వేసి గెలిపించాలి : ఒవైసీ

-

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తాము భారత రాష్ట్ర సమితి పార్టీకే మద్దతు ఇస్తామని mim అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తామని… ముస్లిం సోదరులంతా భారత రాష్ట్ర సమితికి ఓటు వేయాలని కోరారు.

Muslims should vote BRS to win said Owaisi
Muslims should vote BRS to win said Owaisi

అలాగే పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని… ఇప్పటివరకు బాబ్రీ మసీదుని నిర్మించలేదని విమర్శలు చేశారు ఓవైసీ. కానీ సచివాలయంలో కూలిపోయిన మసీదును మాత్రం సీఎం కేసీఆర్ తిరిగి కట్టించారని కొనియాడారు.

అలాగే రాహుల్ గాంధీకి తన స్టైల్లో సవాలు విసిరారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. దమ్ముంటే హైదరాబాద్ లోక్సభ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని సవాల్ విసిరారు అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news