త్వరలోనే హరీష్ రావు బీజేపీలోకి చేరుతాడు – మైనంపల్లి హనుమంతరావు

-

త్వరలోనే హరీష్ రావు బీజేపీలోకి చేరుతాడని కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ…నా కంటే పదేళ్లు చిన్నోడైన కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. మీది అడ్రస్ లేని కుటుంబం… కాంగ్రెస్ పార్టీ దిగితే కొట్టుకు పోతారని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు కి నేనే టార్గెట్ అన్నారు.

mynampally controversol comments on harish rao

ఎంపీ ఎన్నికలలోపు బీఆర్ఎస్ కు చెందిన 26మంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్ లోకి వస్తారని బాంబ్‌ పేల్చారు. త్వరలోనే హరీష్ రావు బీజేపీలోకి చేరుతాడని పేర్కొన్నారు. అటు నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ… ప్రత్యర్థులను ఒడిచే నైజం మైనంపల్లిదన్నారు. మైనంపల్లిని చూస్తే తిరుపతి ఏడుకొండల స్వామి, శ్రీ రామ చంద్రుడిలా కన్పిస్తాడు…ఆయనను చూస్తే ప్రత్యర్ధులు డైపర్ లు వేసుకొని రావాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news