నల్గొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

-

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందు దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ దళం.. తాజాగా మరో రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇవాళ సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను ప్రకటించిన పార్టీ.. భువనగిరి, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌ను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్, నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేరును ఖరారు చేశారు. దీంతో ఇప్పటి వరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇక మిగిలింది హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం మాత్రమే. అయితే ఈ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఎంఐఎం పార్టీయే విజయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో ఆ పార్టీపై గెలుపొందాలంటే బలం, బలగం ఉన్న నేతను నిలబెట్టాలని గులాబీ బాస్ యోచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మరి కాస్త సమయం పట్టనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news