రూ.2లక్ష రుణమాఫీ గతంలో ఎవ్వరూ చేయలేదు : మంత్రి కోమటిరెడ్డి

-

నల్లగొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎవరు చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. రెండు లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు.

రైతులకు సంబంధించిన ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని, రైతు భరోసా ఏ విధంగా చేయానే దానిపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రెండు లక్షల రుణమాఫీ అందుకుంటున్న రైతులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి. అంతేకాకుండా.. జిల్లాలో ఏ గ్రామంలో కూడా మిషన్ భగీరథ పథకం అందడం లేదని, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version