దమ్ముంటే తెలంగాణకు BRS అధ్యక్షుడిని నియమించాలి – NVSS ప్రభాకర్

-

దమ్ముంటే తెలంగాణకు BRS అధ్యక్షుడిని నియమించాలని బీజేపీ నేత NVSS ప్రభాకర్ డిమాండ్‌ చేశారు. మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయాడని.. అందుకే అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్నీ వర్గాలను మోసం చేసి కేసిఆర్ పబ్బం గడుపుతున్నారు.. అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన కేసిఆరే.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షేమపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్తున్న కేసిఆర్.. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మంచి నీళ్ళు లేని, రానీ కాలనీలు అనేకం ఉన్నాయని చెప్పారు. పదేళ్లలో ప్రజలను మోసం చేసిన దానికి కేసిఆర్ పది సార్లు ప్రజలకు క్షేమాపణ చెప్పి.. ఎన్నికలకు వెళ్ళాలన్నారు. ఉద్యోగ నియామకాలు మరిచి రాజకీయ నియామకాలు మాత్రమే చేస్తున్నారని… కెసీఆర్ గొప్పగా చెప్పుకొనే గొర్ల పంపిణీ నగరంలో ఏ ఒక్క యాదవ కుటుంబానికి అయిన ఇచ్చాడా? అని ప్రశ్నించారు. విభజన చట్టం అమలు చర్చలకు రాకుండా దానికి తూట్లు పొడిచింది మీ నాన్న కేసిఆర్ కాదా అని కేటీఆర్ పై ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version