ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు కుమారుడికి పరీక్ష..!

-

కంటికి రెప్పలా కాపాడిన తండ్రి దూరమయ్యాడనే బాధ ఓ వైపు.. పరీక్ష కాలం మరో వైపు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదనే వేదన. అలాంటి తరుణంలో తండ్రి చనిపోయిన బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఓ విద్యార్థి పరీక్షకు హాజరైన ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో చోటుచేసుకుంది. పుట్టెడు దుఃఖంలో పదో తరగతి విద్యార్థి, కల్లూరు శ్రీరాంపురంకు చెందిన మారబోయిన అఖిల్ పదో తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు.

అయితే ఆదివారం రాత్రి తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధితో చనిపోయాడు. ఇంట్లో తండ్రి మృతదేహం ఉండగానే తప్పనిసరి పరిస్థితుల్లో మొదటి రోజు పరీక్ష హజరయ్యాడు. తండ్రి చనిపోయిన బాధ ఓ వైపు.. పరీక్ష మరోవైపు ఎటు తేల్చుకోలేక పోయిన సందర్భంలో బంధువులు ధైర్యం చెప్పి పరీక్షకు పంపించారు. ఆ బాధను పంటి బిగువున భరిస్తూ.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అతడు పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన వెంటనే వచ్చి తండ్రి అంత్యక్రియల్లో అఖిల్ పాల్గొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news