ఘర్షణకు పల్లవి ప్రశాంత్ నే కారణం : డీసీపీ విజయ్

-

బిగ్ బాస్ నిర్వాహకులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. త్వరలో బిగ్ బాస్ నిర్వాహకులను విచారిస్తామని డీసీపీ విజయ్ వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగినటువంటి హంగామాలో పల్లవి ప్రశాంత్ కావాలనే అక్కడ ఉన్న యువకులను రెచ్చగొట్టాడన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పల్లవి ప్రశాంత్ ను వేరే దారిలో పంపించామన్నారు.

పాపులారిటీ కోసం మళ్లీ వచ్చి.. అక్కడి వారిని రెచ్చగొట్టారని పేర్కొన్నారు. ఎక్కువ మంది గుమిగూడి ఘర్షణలు తలెత్తడానికి కారణం అయ్యాడని చెప్పారు. మరోవైపు ఇవాళ బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ లాయర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని.. అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. పల్లవి ప్రశాంత్ తో పాటు మరో 16 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఆ రోజు పల్లవి ప్రశాంత్ అలా చేయకుండా పోలీసుల మాట విని వెళ్లిపోతే ఏ సమస్య వచ్చి ఉండేది కాదని పలువురు చర్చించారు. ఇతని వల్ల మళ్లీ పేదోళ్లకు బిగ్ బాస్ ఛాన్స్ లు కూడా రావని పలువురు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news