హైదరాబాద్ వ్యాప్తంగా ENO ప్యాకెట్ల పంచాయితీ ?

-

హైదరాబాద్ వ్యాప్తంగా ENO ప్యాకెట్ల పంచాయితీ కొనసాగుతోంది. పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..అంటూ కొందరు కాంగ్రెస్‌ పార్టీ నేతలు రచ్చ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు అంటూ హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు.

eno

కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలంటూ, హైదరాబాద్ లో భారీగా హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

రూ 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు చూసి కడుపు మంటా ? అయితే ENO వాడండి ” అంటూ కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. కాగా.. సీఎం రేవంత్‌ రెడ్డి బృందం… దావోస్‌ కు వెళ్లి… ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరునంలోనే కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు కాంగ్రెస్‌ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news