పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి కన్నుమూత..కేసీఆర్ సంతాపం

-

వికారాబాద్ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీలో విషాదం నెలకొంది. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హరీశ్వర్ రెడ్డి…నిన్న అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. దీంతో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

parigi-mla-father-koppula-harishwar-reddy-passed-away
parigi-mla-father-koppula-harishwar-reddy-passed-away

కాగా… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి. తెలుగు దేశం పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యుడిగా.. 25 సంవత్సరాలు పరిగి ఎమ్మెల్యేగా పనిచేశారు హరీశ్వర్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014 లో ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి.

అయితే.. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి మరణంతో శోకసంద్రంలో కార్యకర్తలు…అభిమానులు ఉన్నారు. ఇక అటు బీఅర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news