RS ప్రవీణ్‌ కుమార్‌ గెలుపు కోసం ఫండ్‌ ఇస్తున్న జనాలు !

-

RS ప్రవీణ్‌ కుమార్‌ గెలుపు కోసం ఫండ్‌ ఇస్తున్నారు జనాలు. తెలంగాణ బ్లాక్ వాయిస్ వ్యవస్థాపకులు శ్రీధర్ గోవిందు నేతృత్వంలో “ఆర్ఎస్పీ సపోర్టర్స్ మీట్” అనే కార్యక్రమం ద్వారా RS ప్రవీణ్‌ కుమార్‌ కు ఫండ్‌ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

People are giving fund for the victory of RS Praveen Kumar

నన్ను నాగర్ కర్నూల్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్లమెంట్ పరిధిలోని యువ ఓటర్లందరూ కలిసి స్వచ్ఛందంగా, నా ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం ఒక్కొక్కరు ఒక్క రూపాయి విరాళంగా మొత్తం రూ.17,500/ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.

నన్ను ఎంపీగా గెలిపించి చారి త్రక విజయాన్ని అందించేందుకు ఈ ప్రాంత ప్రజలు,యువత చూపించే ప్రేమ,ఆప్యాయత నా బాధ్యతను మరింత పెంచుతున్నాయని స్పష్టం చేశారు. మన ప్రాంత పేదింటి బిడ్డల భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మీ ఋణం నా నిస్వార్థ సేవతో తప్పకుండా తీర్చుకుంటానని ప్రకటించారు RS ప్రవీణ్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news