రేవంత్‌ను కలిసిన BRS నేతలెవరో తెలుసు: మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి

-

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ద్రోహం చేసినవారు ఎంతటి హోదాలో ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.  ఈ మేరకు  ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో పార్టీకి ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు.

ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్‌లో కొంత మంది బీఆర్ఎస్ నేతలు రహస్యంగా కలిశారని రోహిత్ రెడ్డి అన్నారు. అయితే ఆయణ్ను ఎవరు కలిశారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారనే విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అలాగే తాండూరు, వికారాబాద్‌లలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి బహుమతిగా ఇస్తానని రేవంత్‌ రెడ్డితో చెప్పింది ఎవరనే విషయం అధిష్ఠాన వర్గానికీ తెలుసని అన్నారు. సమయం వచ్చినపుడు పార్టీ పెద్దలు ఈ విషయంపై మాట్లాడతారని పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news