నాంపల్లిలో పోలీసుల కాల్పులు.. ఓ వ్యక్తికి గాయాలు

-

హైదరాబాద్‌లో చోరీలకు, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు కాల్పులు జరుపుతూ నిందితుల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలుమార్లు తుపాకీ మోత వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి నగరంలో తుపాకీ మోత మోగింది.

హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నించారు. పోలీసుల నుంచి అతడు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అతణ్ని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కాల్పుల్లో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా కాల్పుల శబ్ధంతో ఉలిక్కిపడింది. రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తుండగా పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్పులు జరిపినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news