రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది – *మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి *

-

రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కాంపౌండ్ నిర్మించలేదన్నారు.ఇప్పుడు కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన చేశామని… మా ప్రభుత్వం విద్యా, వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది – *మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి *

రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతోంది…ప్రభుత్వం ఏర్పడిన 75రోజుల్లోనే 31వేల ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిస్తామని.. TSPSCని పునరుద్దరించి ఉద్యోగ నోటీఫికేషన్లు ఇస్తున్నామన్నారు. కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం….తెలంగాణ వచ్చిన తర్వాత వర్సిటీలో అడుగుపెట్టిన మంత్రులం మేమేనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news