‘రోడ్డుమీదికొచ్చినా.. సత్యమార్గంలోనే పోరాడతా’.. పొంగులేటి ఎమోషనల్

-

ఖమ్మం జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ జనగర్జన భారీ బహిరంగ సభ జరగనుంది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవనున్న ఈ సభలో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఆ సభ గురించి.. తన పార్టీ మారడం గురించి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్​లో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాను రోడ్డుమీదకు వచ్చినా.. సత్యమార్గంలోనే పోరాటం చేస్తానని పొంగులేటి స్పష్టం చేశారు.

‘రాహుల్ సభను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకునేందుకుట అనేక రకాల కుట్రలు చేస్తోంది. ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకపోగా మా ప్రైవేటు వాహనాలను కూడా అడ్డుకుంటున్నారు. 15,000 వాహనాలు ఖమ్మం వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నాం. 1700 వాహనాలు అడ్డుకుంటున్నారు ఆర్సీలు లైసెన్స్ లు తీసేసుకున్నారు. అర్దరాత్రి నుంచి ఊళ్ల మీద పడి వాహనాలు సీజ్ చేస్తున్నారు. సభను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతం అవుతుంది.’ అని పొంగులేటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version