నీది నై తెలంగాణ బ్యాచ్… మాది జై తెలంగాణ బ్యాచ్…రేవంత్‌ కు రఘునందన్‌ కౌంటర్‌…!

-

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని… అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయని తెలిపారు. నీది నై తెలంగాణ బ్యాచ్… మాది జై తెలంగాణ బ్యాచ్…అంటూ రేవంత్‌ కు రఘునందన్‌ కౌంటర్‌ ఇచ్చారు. గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారని… తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేనని వివరించారు.

Raghunandan counter to Revanth

నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా…. ఢిల్లీ జంతర్ మంతర్ రండి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి అంటూ సవాల్‌ విసిరారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారా లేదా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయని.. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 10 లక్షలకు కేంద్రం పెంచిందని వెల్లడించారు. దీన్నే ఆరోగ్యశ్రీ కింద మీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారు…. మైనారిటీల పండుగల కోసం రూ. 33 కోట్లు కేటాయించారని తెలిపారు. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా? అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news