డ్రగ్స్ పార్టీపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు !

-

హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ పార్టీపై స్పందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు…సంచలన వ్యాఖ్యలు చేశారు. శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలు అని విచ్చల విడిగా డ్రగ్స్ దందా జరుగుతుందని.. విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, కొకైన్ లు విచ్చల విడిగా తెచ్చి భాగ్య నగరం లో డ్రగ్స్ దందా చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. నిన్న రాత్రి హైదారాబాద్ శివార్లలో భాగా ఫెమాస్ అయిన ఫాం హౌస్ లో అర్ధ రాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, వీఐపీ పంపిల్లలు ఉన్నారని అనేక రకాల వార్తలు వచ్చాయని తెలిపారు.

raghunandhan rao about BRS

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాం హౌస్ ఒనర్ తో కుమ్మక్కు కాకపోతే డిజిపి ఆ ఫాం హౌస్ చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ను వెంటనే రిలీస్ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డిజిపి జితేందర్ ను డిమాండ్ చేస్తున్న 12 గంటలలో సీసీ ఫుటేజ్ రిలీస్ చేయాలని కోరారు. ఫాం హౌస్ లో ఎస్ ఓ టీ పోలీసులు రైడ్ చేసినప్పుడు ఫాం హౌస్ లో మరియు భయట ఉన్న ఫుటేజ్ లు రిలీస్ చేయాలని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి రేవంత్ జన్వాడ ఫాం హౌస్ పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, రేవంత్ రెడ్డి, కేటీఆర్ లు రాజీ పడ్డారని వార్తలు వస్తున్నాయని… రేవంత్ రెడ్డి పొల్యూట్ కాకపోతే జన్వాడ ఫాం హౌస్ లో నిన్న రాత్రి ఎంజరిగింది ప్రజలకు తెలియజేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version