డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

-

 

డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇల్లు ఉన్న వారికే డబల్ బెడ్ రూం ఇల్లు ఇస్తున్నారని.. నా నియోజకవర్గంలో 500 మందికి డబల్ బెడ్ రూం కేటాయిస్తే అందులో 280 మంది వరకు ఇల్లు ఉన్నవారే అంటూ మండిపడ్డారు. 18 వేల మంది దరఖాస్తు చేసుకుంటే కేటాయించింది 500 మందికి మాత్రమేనని.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయని ఆగ్రహించారు.

ఆ విషయము చెప్పేందుకు కేసీఆర్ మీకు సిగ్గు ఎందుకు అని ప్రశ్నించారు. మీ జేబులో నుండి ఇస్తున్నారా మీ పార్టీ ఫండ్ నుండి ఇస్తున్నారా అని నిలదీశారు. రెండు లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పారు… ఇప్పటివరకు ఎన్ని కట్టారని ప్రశ్నించారు రాజా సింగ్. ఇప్పుడు ఇచ్చే ఇల్లు కూడా ఎన్నికల డ్రామా మాత్రమేనని.. ఎమ్మెల్యేల ప్రమేయం ఎందుకు లేకుండా చేశారని ఆగ్రహించారు.మీ వాళ్లకు ఇచ్చుకునెందుకేనా… తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. మోడీ ప్రభుత్వం బంగారు తెలంగాణ కావాలని భావిస్తుంటే కేసీఆర్ మాత్రం మత్తు తెలంగాణగా మారుస్తున్నారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news