యాదాద్రి నూతన ఈవోగా రామకృష్ణ

-

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసులో రాజీనామా లేఖను అందించారు ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో యాదాద్రి ఆలయ నూతన ఈవోగా రామకృష్ణను ప్రభుత్వం నియమించింది. ఆయన గురువారం రోజున పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తన విధుల్లో బిజీ అయిపోయారు.

యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 23న జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుక నిర్వహణకోసం పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. శనివారం ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద ఉదయం 6:42 గంటలకు దైవ దర్శనం కల్పిస్తామని ఈవో వివరించారు. ఆ రోజు నుంచి 28వతేదీ వరకు ఆరు రోజులపాటు జరిపే అద్యయనోత్సవాల్లో వివిధ అలంకార సేవలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలో ఏక కుండాత్మక సుదర్శన మహాయాగానికి ఆలయ ప్రధాన అర్చక బృందంతో కలిసి మాజీ ఈవో  గీత ముగింపు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news