‘రప్పా రప్పా’ మేనియా తెలంగాణకు పాకింది. నిన్న హరీష్ రావు సభలో అల్లు అర్జున్ పుష్ప సినిమా డైలాగ్తో ప్లకార్డులు ప్రదర్శించారు. పటాన్చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో “2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు బీఆర్ఎస్ కార్యకర్తలు.
ఇది వరకే.. రైతు మహాధర్నాలో హరీశ్ రావు ఫోటోతో ‘రప్పా రప్పా 3.0’ ఫ్లెక్సీ వెలువగా, తాజాగా సూర్యపేటలో జగదీశ్ రెడ్డి ఫోటోతో వెలసిన ‘రప్పా రప్పా 3.0 లోడింగ్’ ఫోస్టర్ కలకం రేపింది. ఇది ఇలా ఉండగా ఏపీలో కూడా ఇదే పుష్ప డైలాగ్ పై రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్లకార్డులు ప్రదర్శించినందుకే రవితేజ అనే యువకుడి పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. అతనికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది కోర్టు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా పుష్ప డైలాగ్ తో ప్లకార్డుల ప్రదర్శన జరుగుతున్నాయి.