హైదరాబాద్​ ఓటర్​కు బంపర్ ఆఫర్.. ఓటేయాలంటే ఫ్రీ ర్యాపిడో రైడ్ బుక్ చేసేయ్

-

తెలంగాణ వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అయితే ఎన్నికలు జరిగిన ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా 70 శాతం పోలింగ్​ జరిగితే.. హైదరాబాద్​లో మాత్రం 55 శాతానికి మించడం లేదు. అయితే నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ర్యాపిడో సంస్థ కూడా ఓ ఉపాయం ఆలోచించింది. అందుకోసం పోలింగ్ డే స్పెషల్​ ప్రోగ్రామ్ రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్రీ రైడ్ షేరింగ్​ను చేపట్టింది.

ఇవాళ హైదరాబాద్ నగరవ్యాప్తంగా 2,600 పోలింగ్​ బూత్​లకు ఉచిత రైడ్​లను అందిస్తూ.. రైడ్​ షేరింగ్​ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గ్రేటర్​ హైదరాబాద్​లో పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు ఈ వినూత్న పోగ్రాంకు సిద్ధమైనట్లు ఈ సంస్థ వెల్లడించింది. ర్యాపిడో కెప్టెన్లంతా ఇవాళ ఉదయం నుంచే రైడ్​లకు సిద్ధంగా ఉన్నారు. ఓటు వేయాలనుకునే ఓటర్లు ర్యాపిడో యాప్​లో రైడ్​ కోరిన వెంటనే వారిని పోలింగ్​ బూత్​ల వద్దకు ఉచితంగా బైక్​ మీద తీసుకువెళ్తారు. ఇంకెందుకు ఆలస్యం మరి మీరూ ర్యాపిడో ఫ్రీ రైడ్ బుక్ చేసి ఓటు హక్కు వినియోగించుకోండి.

ర్యాపిడో ఫ్రీ రైడ్ ఎలా బుక్ చేయాలంటే..

  • ముందుగా ర్యాపిడో బైక్​ ట్యాక్సీ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • యాప్​ లాగిన్​ అయిన తర్వాత ఉచిత రైడ్​ సేవలపై వివరాలు ప్రత్యక్షమవుతాయి.
  • ఉచిత రైడ్​ సేవలలో పోలింగ్​ బూత్​ ఎక్కడుందో టైప్​ చేయాలి.
  • అనంతరం కూపన్​ కోడ్​ వస్తుంది.
  • కూపన్​ కోడ్​ ఉన్న చోట వోట్​ నౌ అనే వన్​ టైమ్​ కోడ్​ను నమోదు చేయాలి అంతే మీ రైడ్ బుక్కయినట్లే.

Read more RELATED
Recommended to you

Latest news