సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత…700ల ఏపీ పోలీసుల చొరబాటు..!

-

తెలంగాణ పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య గొడవ తెరపైకి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ మరియు తెలంగాణ పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి దాటాక ఏపీ పోలీసులు… నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. ఈ తరుణంలో అక్కడే కాపలా ఉన్న ఎస్పీఎఫ్ సిబ్బందిని గేట్లు తీయాలని కోరారు ఏపీ పోలీసులు.

high tension at nagarjuna sagar
high tension at nagarjuna sagar

ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి వచ్చేసారు. గేట్లు తీయాలని ఏపీ పోలీసులు కోరగా… ఎందుకు తీయాలని తెలంగాణ పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల పోలీసుల మధ్య గొడవ చోటుచేసుకుంది. కొంతమంది ఏపీ పోలీసులు గేట్లు దూకారు. సీసీ కెమెరాలు కూడా అద్వాంసం చేశారు. మొత్తం 26 గేట్లు ఉండగా అందులో 13 గేట్లు తమ వంతు ఏపీ పోలీసులు వాగ్వాదానికి దిగారు. అర్ధరాత్రి ఇలాంటి గొడవలు ఎందుకు చేస్తున్నారని తెలంగాణ పోలీసులు కూడా వారించారు. దీంతో అక్కడ అర్ధరాత్రి ఉద్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనలో తరుణం లో తెలంగాణలోకి 700 మంది ఏపీ పోలీసులు ఎంటర్ అయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news