తెలంగాణలో 76,842 మందికి ‘రేషన్‌’ కట్!

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులను తొలగించే పనిలో పడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డుల పై తాజాగా క్షేత్రస్థాయి పరిశీలన… మొదలుపెట్టింది. గడిచిన ఆరు నెలల్లో రేషన్ తీసుకొని వారి వివరాలను అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది.

ration
Ration cut for 76,842 people in Telangana

ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 76,842 మంది అనర్హులుగా తేలినట్లు గుర్తించారు అధికారులు. ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించడం జరిగింది. కొద్ది రోజుల్లోనే వీరిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ 76,842 మందిలో… చనిపోయిన వారు, వలస వెళ్లిన వారు, రెండు స్థానాలు రేషన్ కార్డుల్లో పేరు ఉన్నవారు మాత్రమే ఉన్నారని అధికారులు చెప్పడం జరుగుతుంది. అందుకే వీరందరినీ తొలగించాలని ఆలోచన చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news