ప్ర‌గ‌తిభ‌వ‌న్ చేరుకున్న సీఎం కేసీఆర్‌.. క‌రోనాపై రివ్యూ

-

సీఎం కేసీఆర్ క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. అయ‌తే ఆయ‌న ఫాంహౌస్ లో ఉండి నిన్న‌టి వ‌ర‌కు చికిత్స తీసుకున్నారు. ఇక ఇటీవ‌ల నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఆయ‌న‌కు నెగెటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న పూర్తిగా కోలుకునే వ‌ర‌కు ఫాంహౌస్ లోనే ఉన్నారు.

ఇక ఈ రోజు(గురువారం) సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయ‌న క‌రోనాపై అధికారుల‌తో రివ్యూ నిర్వ‌హించ‌నున్నారు. ఇక ఆరోగ్య‌శాఖ కూడా ఆయ‌న ద‌గ్గ‌రే ఉండ‌టంతో.. మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. ఇక హైకోర్టు సూచించిన‌ట్టు వీకెండ్ లాక్ డౌన్ పై కూడా చ‌ర్చించి, నిర్ణ‌యం తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news