తుమ్మలపై రేగా కాంతరావు వివాదాస్పద వ్యాఖ్యలు!

-

ప్రత్యర్థులపై సోషల్ మీడియా లో ప్రభుత్వ విప్ రేగా కాంతరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా ఉన్న ఉద్యోగాలు ఉడపికే ప్రభుత్వం కావాలా యువకులు ఆలోచించుకోవాలి..పనికిరాని రనోడని ప్రజలు పక్కన పెడితే.. ఈయన తెచ్చిన పనులు నేను ఇంకా ప్రారంభిస్తున్నానట.. వంద పడకల హాస్పిటల్ కి వెళ్లి మాట్లాడు అదే డైలాగు అని పేర్కొన్నారు.

 

నీ తెలివి తక్కువ తనానికి DMFT ఫండ్స్ వంద కోట్లు నష్ట పొయారు ప్రజలు…రిటన్ నేను 100 కోట్లు SDF ఫండ్స్ తెచ్చా అది నా దమ్ము…గోదావరి నది మీద చిన్నరావిగూడెం నుండి పర్ణశాల బ్రిడ్జి నిధులు ఎటు పోయాయో తెలియని సోయి లేనిడివో..నువ్వు నిధులు తెస్తే నేను ప్రారంభించుడా వారెవ్వా ప్రజలకు అన్ని తెలుసు అన్నారు. పినపాక ప్రజల మీద ప్రేమతో తుమ్మల ఆ మాత్రం పనులు చేపించక పోతే అంధకారమే మిగిలేది మనకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రేగా కాంతారావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version