యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్నీ యాదవ్ అన్ని దేశాలకు వెళ్లినట్లే పాకిస్థాన్ కు కూడా వెళ్లాడని పేర్కొన్నారు. అనవసరంగా సోషల్ మీడియాలో నా కొడుకుపై ఇష్టమొచ్చిన వార్తలు రాస్తున్నారన్నారు. పాక్ తో సంబంధాలు, ఉగ్రవాదులతో లింకులు అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని చెప్పారు.

సన్నీ యాదవ్ ఫిబ్రవరిలో పాకిస్థాన్ కు వెళ్లి 2 నెలలు అక్కడే ఉన్నాడని చెప్పారు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ తండ్రి. అసలు మా అబ్బాయిని ఎవరు అరెస్ట్ చేశారో పోలీసులు మాకు స్పష్టత ఇవ్వాలన్నారు. సన్నీ యాదవ్ ఒకటే బెట్టింగ్ యాప్ ప్రోమోషన్ చేశాడని వెల్లడించారు. బెట్టింగ్ యాప్ విషయంలో కూడా ఆయనపై ఫేక్ వార్తలు రాశారని ఫైర్ అయ్యారు.
సన్నీ యాదవ్ అన్ని దేశాలకు వెళ్లినట్లే పాకిస్థాన్ కు కూడా వెళ్లాడు
అనవసరంగా సోషల్ మీడియాలో నా కొడుకుపై ఇష్టమొచ్చిన వార్తలు రాస్తున్నారు
పాక్ తో సంబంధాలు, ఉగ్రవాదులతో లింకులు అంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు
సన్నీ యాదవ్ ఫిబ్రవరిలో పాకిస్థాన్ కు వెళ్లి 2 నెలలు అక్కడే ఉన్నాడు… pic.twitter.com/KV61d6SpQM
— BIG TV Breaking News (@bigtvtelugu) May 30, 2025