కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా కీలకం : రేవంత్‌ రెడ్డి

-

ఇవాళ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఇంటికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డి బ్రదర్స్ పార్టీ అభ్యున్నతిలో కీలకమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తర్వాత… తెలంగాణ కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి అని తెలిపారు. కేసీఆర్.. పదవులకు రాజీనామా చేసి మళ్లీ తెచ్చుకున్నాడని ఫైర్ అయ్యారు.

కానీ వెంకట్ రెడ్డీ మంత్రి పదవికి దూరంగా ఉన్నారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.కొత్త పార్టీ పెడతా అని కేసీఆర్ చెప్పిన వార్తలు చూశానని… కేసీఆర్..మోడీ కోవర్ట్ అని నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని చీల్చే కుట్ర అని ఆగ్రహించారు. మోడీకి, ఎన్డీయేకి అనుకూలంగా పని చేసేందుకు కేసీఆర్ సుఫారీ తీసుకున్నారని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నాలుగు కోట్ల మంది బాగుండాలని తెలంగాణ ఇచ్చామని.. నాలుగు కుటుంబాలు బాగుండాలి అని ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version