గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్…నెలకు రూ. 8 వేలు…!

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త అందజేసింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ప్రమాణాల పెంపనకు కీలక చర్యలు చేపడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ తరగతుల కోసం ప్రతి పాఠశాలలో ఒక విద్యా వాలంటీర్, ఒక ఆయాను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ కు నెలకు రూ. 8వేలు, ఆయాకు రూ. 6 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు.

Revanth Reddy government has given good news to the people of Telangana
Revanth Reddy government has given good news to the people of Telangana

దీంతో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలలో డబ్బులు ఖర్చు చేసి ప్రీ ప్రైమరీ తరగతులలో పిల్లలను కూర్చోబెడుతున్న తల్లిదండ్రులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందజేసింది. లక్షలలో డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్న తల్లిదండ్రులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోరింది. దీంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news