నేడు పొంగులేటిని కలవనున్న రేవంత్ రెడ్డి

-

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఏ పార్టీలో చేరతారనే విషయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై పొంగులేటితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చించనున్నట్లు సమాచారం. ఇందుకోసమే రేవంత్ ఇవాళ పొంగులేటి నివాసానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు రేవంత్ పొంగులేటి, జూపల్లి కృష్ణారావులతో భేటీ కానున్నారు. పార్టీలోకి రావాల్సిందిగా అధికారికంగా రేవంత్‌రెడ్డి వారిని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు వారి అనుచరులకు సమాచారం ఇచ్చారు. పొంగులేటితో పాటు కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చే మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా రేవంత్‌ సమావేశానికి హాజరు అవుతారు.

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 22వ తేదీన దిల్లీకి రానున్నారు. రాహుల్ వచ్చిన వెంటనే ఆయనతో రేవంత్​రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. అదే విధంగా ఇవాళ రేవంత్​తో భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version