ప్రవల్లిక ఆత్మ ఘోష…సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదా – రేవంత్‌ రెడ్డి

-

ప్రవల్లిక ఆత్మ ఘోష…సీఎం కేసీఆర్ చెవికి వినబడటం లేదా అని పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక సంఘటనపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదని మండిపడ్డారు.

revanth reddy on pravalika incident
revanth reddy on pravalika incident

ఈ పెద్దమనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదని ఆగ్రహించారు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదని మండిపడ్డారు. ప్రవల్లిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతోందని చెప్పారు. విద్యార్థిని ఆత్మహత్య పై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news