బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి

-

బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో  ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో ఎంఐఎం దోస్తీ చేస్తుందా ? అని ఆయన ప్రశ్నించారు. గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చాలని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ కోరారు.

కర్ణాటకలో కాంగ్రెస్ కు కేసీఆర్ కు డబ్బు పంపారని మోడీ ఆరోపించారు. ఆ సమాచారం ఉంటే కేసీఆర్ పై ఎందుకు చర్య తీసుకోలేదు? ఈడీ, ఐటీ కేసులు ఎందుకు నమోదు కాలేదు? కేసీఆర్ తన అక్రమ సంపాదనలో కొంత మోడీకి చెల్లిస్తున్నారు. బీఆర్ఎస్  అవినీతిలో బీజేపీని ఆయన భాగస్వామిని చేశారు. బీఆర్ఎస్, బీజేపీ అవిభక్త కవలలు.. వారిది ఫెవికాల్ బంధం. సెక్యులర్ వాదులమని చెప్పే అసదుద్దీన్ ఇప్పుడేం చెబుతారు? నీళ్లు అంటే కవిత కన్నీళ్లు.. నిధులు అంటే కాలేశ్వరం అవినీతి. నియమాకాలు అంటే కేటీఆర్ కు సీఎం సీటు గుర్తొస్తాయి అని రేవంత్ వ్యాఖ్యానించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version