Revanth Reddy : నేడు నామినేషన్ దాఖలు చేయనున్న రేవంత్ రెడ్డి

-

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కొడంగల్ పట్టణంలో నామినేషన్ పత్రాలను ఆయన అధికారులకు అందజేయనున్నారు. మరో స్థానంలో సీఎం కేసీఆర్ పై పోటికి సిద్ధమైన ఆయన నవంబర్ 10న కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Revanth Reddy will file nomination today

ఇది ఇలా ఉండగా.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 10తో ముగియనుంది. ఇప్పటి వరకు 236 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మంచి రోజు కోసం అభ్యర్థులు చూస్తున్నారు. 8న దశమి, 9న ఏకాదశి, 10వ తేదీ చివరి రోజు కావడం తో ఆయా రోజుల్లో భారీగా నామినేషన్లు దాఖలు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్వో ఆఫీసుల వద్ద చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news