తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం – సైదిరెడ్డి

-

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందన్నారు సైదిరెడ్డి. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ శానంపూడి సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు రోజుల కిందట బీజేపీలో చేరారు. అనంతరం తన కార్యకర్తలతో మాట్లాడిన సైదిరెడ్డి ఆడియో వైరల్‌ గా మారింది.

S Saidireddy

ఢిల్లీకి పిలిచి బీజేపీ కండువా కప్పుకోమన్నారని…ఎంపీ టికెట్ నీకే వస్తుందన్నారని సైదిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు కండువా కప్పుకోకుంటే పార్టీ పరువు పోతుందన్నారు….కేంద్రంలో మళ్ళీ బీజేపీనే వస్తుంది..మోడీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వకుండా అవతల వారికి ఇస్తే ఎలా పని చేస్తామని…ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి అర్ధం కావడం లేదన్నారు. రంజిత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి పోటీ చేయడం లేదు…సీఎం రేవంత్ రెడ్డిని దింపాలని కాంగ్రెస్ వాళ్ళే అనుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారు…పార్టీ మారినందుకు క్షమించండని సైదిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version