గత 8 నెలల్లో మహిళలపై 1900 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు – హరీశ్ రావు

-

గత 8 నెలల్లో మహిళలపై 1900 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు. ఇవాళ జైనూరు అత్యాచార బాధితురాలిని పరామర్శించారు హరీష్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ఈ సందర్బంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. మహిళలు అంటే ఒక చులకనభావంగా ఈ పరిపాలన జరుగుతుందని ఆగ్రహించారు. మహిళల పట్ల హత్యాచారాలు జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరిక కూడా లేదని వెల్లడించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు.

జైనూర్ ఘటన అత్యంత పాశవికం.. కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. 1900 హత్యాచారం కేసులు నమోదయ్యాయన్నారు. కేసీఆర్ హయాంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండే దని వెల్లడించారు హరీశ్ రావు. ముఖ్యమంత్రి దగ్గరే హోం శాఖ ఉంది.. ప్రతి రోజూ 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టు అయ్యిందని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు.

 

Read more RELATED
Recommended to you

Latest news