గద్దర్ కు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడంలో తప్పు లేదు – సజ్జనార్

-

గద్దర్ కు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడంలో తప్పు లేదని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ అన్నారు. గద్దర్ కి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడం లో తప్పు లేదు..పోలీసులను అగౌరవ పరిచినట్టు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను తన గానం రూపంలో చాటి చెప్పాడని వివరించారు.

ఉద్యమంలో గద్దర్ పాటలు ఎంతో ప్రభావితం చేశాయి.. ఓ గౌరవప్రదమైన వ్యక్తికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయడంలో తప్పు లేదని పేర్కొన్నారు. నేను సమర్థిస్తున్నానని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జానార్. అటు దీనిపై తలసాని మాట్లాడుతూ… గద్దర్ ఒక పార్టీ నేత కాదు.. ప్రజా నాయకుడు.. తెలంగాణ గొంతుక… పద్ధతి మానుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ కూడా కీలక వ్యక్తి అని వెల్లడించారు మంత్రి తలసాని. అలాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారని..దీన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని ఫైర్ అయ్యారు. గొప్ప వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం గా భావించాలన్నారు తలసాని.

 

Read more RELATED
Recommended to you

Latest news