దళిత గిరిజన డిక్లరేషన్ ను మొదట కర్ణాటకలో అమలు చేయండి – సత్యవతి

-

దళిత గిరిజన డిక్లరేషన్ ను మొదట కర్ణాటకలో అమలు చేయండని మంత్రి సత్యవతి… కాంగ్రెస్‌ పార్టీకి సవాల్‌ విసిరారు. కాంగ్రెస్ దళిత గిరిజన డిక్లరేషన్ ను ఖండిస్తున్నానని… కాంగ్రెస్,బిజెపి కి డిపాజిట్ రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటి మయాల ఫకీర్ లు వస్తారని..గిరిజనుల, దళితులపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు గిరిజనులకు ఏమి చేసింది ? అని నిలదీశారు. మల్లికార్జున ఖర్గే తప్పుడు మనిషి…మయా మాటలు చెప్పవద్దని పేర్కొన్నారు. తప్పు డిక్లరేషన్ ను ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ ఉంచిందని.. కాంగ్రెస్ పార్టీకి దేశ వ్యాప్తంగా ప్రకటించే దమ్ము ఉందా..? అని నిలదీశారు. మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కర్ణాటక లో అమలు చేసి తెలంగాణ లో చెప్పు..కర్ణాటక లో ఇచ్చిన ఒక హామీని కూడా అమలు చేయలేదు..మూడు నెలలకే ఎత్తి వేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను ఎన్ని సార్లు మోసం చేస్తారూ? అని ఆగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version