జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇచ్చిన సమన్లపై సుప్రీంకోర్టుకు కేసీఆర్‌.. నేడే విచారణ

-

తెలంగాణలో గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్​గఢ్​ నుంచి జరిగిన విద్యుత్​ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరపడానికి జస్టిస్​ ఎల్​.నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్​ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్​ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై జూన్​ 24వ తేదీన కేసీఆర్​ దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్​ నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ విద్యుత్​ సంస్థలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్​ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్​ విద్యుత్​ కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపి, ఆ నిర్ణయాల్లోని నిబద్ధతను తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 14న జస్టిస్​ ఎల్​. నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్​ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news