ఆ కేసుల స్క్రిప్ట్ లు తయారయ్యేది గాంధీ భవన్ లోనే.. ఆర్.ఎస్. ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్రంలో రాక్షస-రాబంధుల పాలన నడుస్తోందని జైలులో ఉండాల్సిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా ఉన్నాడని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ ధ్వంసం చేస్తున్నారని.. ప్రజల హక్కులను కాపాడాల్సిన సీఎం వాటిని హరిస్తున్నాడని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకగా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మార్చి 15, 16 తేదీలలో పదిహేను కేసులు పెట్టారని.. రీ ట్వీట్ చేసిన వారిపై కూడా కేసులు పెడుతున్నారని అశ్లీలత మీద పెట్టాల్సిన సెక్షన్ 67 ఐటీ యాక్ట్ ని బీఆర్ఎస్ కార్యకర్తల మీద ప్రయోగించి ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని తెలిపారు. రేవంత్ హోంమంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను దుర్వినియోగం చేస్తున్నారని డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరోను రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియా పై ప్రయోగిస్తున్నారని.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరూ రేవంత్ రెడ్డి తొత్తులుగా పని చేస్తూ కాపీ పేస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version