బీజేపీలో విలీనం కోసమే…. కేటీఆర్, హరీష్ ఢిల్లీకి వచ్చారు – భువనగిరి ఎంపీ

-

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ కోసం వచ్చిన కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో వీలీనం చేసే చర్చలు జరుగుతున్నాయన్న అనుమానం కలుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. బెయిల్ కోసం ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదని… బీఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే నవ్వు వస్తుందని చురకలు అంటించారు.

Sensational comments of Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy

రాజకీయాల్లో లేని సంతోష్ రావును రాజ్యసభ సభ్యునిగా కేసీఆర్ చేసారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకోసం ఎన్నడూ ఫాంహౌజ్ గత ముఖ్యమంత్రి దాటలేదని…. ఐటీ మంత్రి హోదాలో కేటీఆర్ జరిపిన విదేశీ పర్యటనలు , తెచ్చిన పెట్టుబడుల పై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు.
ఎక్కువ వడ్డీకి రుణాలు తెచ్చిన బీఆర్ఎస్ నేతలు , ఏనాడు తక్కువ వడ్డీ రుణాల కోసం ప్రపంచబ్యాంకు తలుపుతట్టలేదన్నారు. రేవంత్ రెడ్డి అధికారులను, మంత్రులను తీసుకుని అమెరికా పర్యటనకు తీసుకువెళ్లారని పేర్కొన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news