బీఆర్ఎస్ ఎంపీలను కలిసిన దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్

-

ఢిల్లీ: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆరిజన్ డైరీ నిర్వాహకురాలు శేజల్ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు బిఆర్ఎస్ ఎంపీలను కలిసింది ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్. ఎంపిల వాహనానికి అడ్డుగా నిలిచి నిరసన వ్యక్తం చేసింది.

దీంతో కారు దిగివచ్చి శేజల్ ను కలిశారు ఎంపి సురేష్ రెడ్డి. తమకు న్యాయం చేయాలంటూ ఎంపీ సురేష్ రెడ్డి కాళ్లు పట్టుకుంది ఆరిజన్ డైరీ నిర్వాహకులు శేజల్, ఆదినారాయణ రెడ్డి. దుర్గం చిన్నయ్య అనుచరుల నుంచి రోజు బెదిరింపు మెసేజ్ లు, ఫోన్లు వస్తున్నాయంటూ సురేష్ రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేసింది శేజల్. వెంకటేష్ నేతను దీనిపై స్పందించాలని కోరింది శేజల్. దీంతో తనకు డీటెయిల్స్ ఇస్తే తాను మాట్లాడతానని షేజల్ కు హామీ ఇచ్చారు రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news