మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్.. మాల్ స్వాధీనం చేసుకున్న TSRTC

-

బీఆర్ఎస్ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీఎస్ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టిప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని #TSRTC యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపం లోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం సంస్థ స్వాధీనం చేసుకుంది.

ఆర్టీసీకి చెందిన 7059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీవోటీ) కింద 01.06.2013న లీజ్కు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా టేస్ఓవర్ చేసుకుని.. షాపింగ్ మాల్ కి జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ గా పేరుపెట్టారు. థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్ కి ఇచ్చారు. బకాయిలు ఫెండింగ్ లో ఉన్నాయి. ఐదేళ్ల నుంచి దాదాపు 20 కి పైగా నోటీసులు జారీ చేశారని.. వాటిని చెల్లించకపోవడంతో ఆర్టీసీ అద్దె ఒప్పందాన్ని రద్దు చేసిందని సజ్జనార్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version