అదంతా అవాస్తవం.. తన ట్వీట్​పై స్మితా సభర్వాల్‌ క్లారిటీ

-

సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ బుధవారం రోజున సోషల్ మీడియా వేదికైన ఎక్స్ ద్వారా ఓ పోస్టు పెట్టారు. తాను సివిల్ సర్వీస్ రంగంలోకి వచ్చి ఈ ఏడాదితో 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్​ను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చిత్రీకరించాయని ఆమె మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమని ట్విటర్‌ (ఎక్స్) వేదికగా స్పష్టం చేశారు.

తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత ఇచ్చినా చేస్తాను. రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను. అంటూ ట్వీట్​లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయంలో స్మితా సభర్వాల్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల నీటిపారుదల ముఖ్య కార్యదర్శిగా రజత్ కుమార్ స్థానంలో కీలక బాధ్యతలను అదనంగా చేపట్టిన విషయం కూడా తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version