రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కొడుకు

-

తెలంగాణ దారుణం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసాడు కొడుకు. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన బానోత్ కీర్యా అనే రైతుకు ఎకరం భూమి ఉండగా, రూ.6000 రైతు భరోసా పథకం కింద జమ చేసింది ప్రభుత్వం. రైతుబంధు డబ్బు ఇవ్వమని తన చిన్న కొడుకు సంతోష్ అడగడంతో, ఆరోగ్యం బాగాలేక రూ.2000 ఖర్చు చేశానని మిగతా రూ.4000 ఇస్తానని చెప్పారు తండ్రి కీర్యా.

rythu bharosa
rythu bharosa

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యి, తండ్రిని కొట్టడమే కాకుండా గొడ్డలితో నాలుక కోసేసాడు సంతోష్. తీవ్ర రక్తస్రావం కావడంతో కీర్యాను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇక అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news