పబ్‌లో గ్యాంగ్ రేప్.. చిక్కుల్లో ఎమ్మెల్యే కుమారుడు

-

HYD: ఆమ్నేషియా పబ్ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తాజాగా 17 ఏళ్ల బాలికపై కారులో గ్యాంగ్ రేప్ జరుగగా.. నలుగురు అత్యాచారం చేశారని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. అత్యాచార నిందితుల్లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు ఉన్నట్లు సమాచారం అందుతోంది. వైద్య పరీక్షల కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు అధికారులు.

అత్యాచారానికి ముందే వెళ్లిపోయిన ఓ ప్రజాప్రతినిధి కొడుకు.. ప్రజాప్రతినిధి కుమారుడిని ఇప్పటికే ప్రశ్నించారు పోలీసులు. పోలీసుల అదుపులో బాలికను పార్టీకి తీసుకెళ్లిన హాడి.. పబ్‌లోనే బాలికను ట్రాప్ చేశాడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కొడుకు. బాలికను ట్రాప్ చేసి బెంజ్ కారులో తీసుకెళ్లిన యువకులు.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ దగ్గర ఫుడ్ కొన్నారు యువకులు. నిర్మానుష్య ప్రాంతంలో కారులోనే బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. గాయాలైన బాలికను పబ్ వద్ద మరో కారులో వదిలేసిన యువకులు.. అత్యాచార నిందితులు 16 ఏళ్ల బాలురేనన్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news