తల్లి తిట్టిందని పెట్రోల్ పోసుకుని కొడుకు ఆత్మహత్య…!

-

తల్లి మందలించడంతో కుమారుడు సంతోష్ కుమార్(18) ఆత్మహత్య చేసుకున్నాడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల లో ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు సంతోష్ డిప్లొమా చదువుతూ మధ్యలోనే ఆపేసి అటు చదువు చదవక,ఉద్యోగం చెయ్యక తిరుగుతుండడంతో తల్లి మందిలించింది అని పోలీసులు పేర్కొన్నారు.

దీంతో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నిన్న ఉదయం ఇంట్లో నుండి వెళ్లిపోయిన సంతోష్ కుమార్… అప్పటి నుంచి కనపడలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు తో నిన్న 9 వ తేదీన ఉదయం చందానగర్ పోలీస్ స్టేషన్ లో సంతోష్ కుమార్ పై మిస్సింగ్ కేసు నమోదు చేసిన చందానగర్ పోలీసులు దర్యాప్తు చేసారు. మొబైల్ లొకేషన్ ఆధారంగా నల్లగండ్ల హుడా లే ఔట్ లో సంతోష్ కుమార్ ఆచూకీ ని కనుక్కున్నారు. అప్పటికే సంతోష్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news