టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. అశ్విన్, శార్దూల్ అవుట్..!

-

టీమిండియాతో రెండో టెస్ట్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తెంబా బవుమా గాయం కారణంగా దూరం అయినా నేపథ్యంలో అతని స్థానంలో డీన్ ఎల్గర్ సౌతాఫ్రికా కెప్టెన్ గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యం అని టాస్ సందర్భంగా పేర్కొన్నాడు. పిచ్ బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. తొలుత బ్యాట్ కి రంగంలోకి దిగాలని నిర్నయించుకున్నట్టు వెల్లడించారు. తొలి టెస్ట్ లో గెలిచాం.. కాబట్టి కేప్ టౌన్ లో తాము ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలమని ఎల్గర్ పేర్కొన్నారు.

గాయాల కారణంగా జట్టుకు దూరం అయిన బవుమా స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కోయెట్జీ స్థానంలో లుంగీ ఎంగిడినీ రెండో టెస్ట్ లో ఆడిస్తున్నట్టు ఎల్గర్ చెప్పాడు. వెటరన్ ఓపెనర్ డీన్ ఎల్గర్ కెరీర్ లో ఇదే చివరి టెస్ట్ కావడం విశేషం. ఇప్పటికే బాక్సింగ్ డే టెస్ట్ లో ఓటమి పాలైంది టీమిండియా. రెండో మ్యాచ్ లో రెండు మార్పులు చేసింది. రవీంద్రన్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా, పేసర్ శార్దూల్ ఠాకర్ స్థానంలో ముకేష్ కుమార్ తుది జట్టులోకి తీసుకున్నారు.

సౌతాఫ్రికా టీమ్ :

డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నై, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.

టీమిండియా :

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కే.ఎల్.రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ముకేష్ కుమార్. 

 

Read more RELATED
Recommended to you

Latest news