తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 25న సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు కేసు విచారణ జరిగిన సంగతి తెలిసిందే.

గత విచారణ సందర్భంగా ప్రభుత్వం, అసెంబ్లీ సెక్రటరీ, 10 మంది ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పిటిషన్ పై ఈ నెల 22లోగా స్పందించాలని న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మరో సారి నోటీసులు జారీ చేయడం జరిగింది.