పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు..ఉప ఎన్నికలు గ్యారెంటీనా!

-

పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై సుప్రీం సంచలన నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. దానం నాగేందర్ , కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు ల అనర్హత పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీం కోర్ట్ ధర్మాసనం వెల్లడించింది. ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి కి అందజేయాలని సుప్రీం ఆదేశించింది. అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు.

BRS-supre

అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి తగిన సమయం అంటే ఎంతో చెప్పాలని గత విచారణలో స్పీకర్ ను కోరింది సుప్రీం. తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది బి.ఆర్.ఎస్. ఇందులో భాగంగానే… సుప్రీంకోర్టును ఆశ్రయించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు. శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ లు టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటివరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది బిఆర్ఎస్.
ఈ కేసు విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ల ధర్మాసనం… ఫిబ్రవరి 10కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news